రైలు ప్రమాదంలో ఏడుగురి మృతి

జకార్తా : ఇంధనంతో వెళ్తున్న ఒక ట్రక్కును రైలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రైలు ప్రయాణీకులు ఏడుగురు మృతి చెందారు. దక్షిణ జకార్తాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఇంజనీరుతో పాటు ఆరుగురు య్రాణీకులు మృతి చెందారని 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.