మధ్యప్రదేశ్‌ సీఎం గా శివరాజ్‌ చౌహాన్‌ ప్రమాణం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం భోపాల్‌లోని జంబూరీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాం నరేష్‌ యాదవ్‌ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో ప్రమాణం చేయించారు. శివరాజ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి. భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా లోక్‌ సభాపక్ష నేత సుష్మౄస్వరాజ్‌, అగ్రనేతలు ఎల్‌.కె.అధ్వానీ,వెంకయ్యనాయుడు, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, ఎం.ఎన్‌.ఎన్‌ అధినేత ఉద్ధవ్‌ థాక్రే, భాజపా సీనియర్‌ నేతలు రవిశంకర్‌ ప్రసాద్‌, జశ్వంత్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, ఉమాభారతి, పారిశ్రామిక వేత్తఅనిల్‌ అంబానీ తదితరులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.