మినీలా విమానాశ్రయంలో మేయర్‌ కుటుంబం కాల్చివేత

మనీలా: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో పట్టణ మేయర్‌ కుటుంబం మృతి చెందింది. కాల్పుల్లో మేయర్‌, అతని భార్య, ఇద్దరు సహచరులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. దేశంలోని మరో ప్రాంతానికి వెళ్లి మనీలా తిరిగివచ్చిన మేయర్‌ కుటుంబం వాహనం కోసం ఎదురుచూస్తుండగా మోటార్‌ సైకిల్‌ పై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయినట్లు సమాచారం.