73కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తర భారతంలో వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 73కు చేరింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో 72 వేల మంది చిక్కుకుకున్నారు. గంగా , దాని ఉపనదుల్లో వరద ఉధృతి తగ్గుతుంది. ఒక్క ఉత్తరాఖండ్‌ లోనే మృతుల సంఖ్య 44 కి చేరింది. 175 ఇళ్లు, భవంతులు కొట్టుకుపోయాయి. రుద్రప్రయోగ్‌ జిల్లాలో అలకనంద నది బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో 23 మంది మృతి చెందారు. 40 హోటల్స్‌తోపాటు 73 భవనాలు కొట్టుకుపోయాయి. చార్ధాం యాత్రలో 71,440 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. చమోలీ ప్రాంతంలో 27,040 మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరకాశీలో 9850 యాత్రికులు చిక్కుకుపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. 60 గంటలుగా చిక్కుకుపోయిన హిమాచల్‌ సీఎం వీరభద్రసింగ్‌ మరో 1700 పర్యాటకులను అధికారులు కాపాడారు.