ముషౄరఫ్‌ ఇంటి సమీపంలో పేటుడు పదార్థాలు లభ్యం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. సుమారు 2.5 కిలోల బరువున్న పేలుడు పదార్థాలతో పాటు రెండు డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ముషౄరఫ్‌ పై దేశ ద్రోహం నేరం కింద కేసు విచారణ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.