ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై కాల్పులు

ఎథెన్స్‌ : గ్రీకు రాజధాని ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటఘెవరికి ప్రమాదం జరగలేదు. భవనం మొటల్‌ గేటుపై నాలుగు సార్లు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో 60 బుల్లెట్‌ కేసులను స్వాధీనం చేసుకున్నారు. తమ దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఉగ్రవాదులే ఈ కాల్పులకు పాల్పడ్డారని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఆరోపించారు.