ఇరాక్‌లో భూకంపం : ఒకరి మృతి

టెహ్రాన్‌ : దక్షిణ ఇరాన్‌లో 5.5 తీవ్రత భూకంపం సంభవించినట్లు ఆ దేశ టెలివిజన్‌ ప్రకటించింది. బస్తక్‌ పట్టణ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఒకరు మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని టీవీ వార్తలు పేర్కొన్నాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయని సమాచారం. భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న ఇరాన్‌లో రోజుకు కనీసం ఒక్క ప్రకంపన అయినా నమోదవుతూనే ఉంటుంది.