ధోని గురించి ఎలాంటి వార్తలు ప్రసారం చేయవద్దు

ధోని గురించి ఎలాంటి వార్తలు ప్రసారం చేయవద్దు
జీ నెట్‌వర్క్‌కి మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
చెన్నై: ధోని గురించి ఏవిధమైన వార్తలు ప్రసారం చేయవద్దని జీ నెట్‌వర్క్‌కి మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. ధోనిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసినందుకు జీ నెట్‌వర్క్‌పై ఆయన పరువునష్ట దావా వేసిన సంగతి తెలిసిందే. తన పరువుకు నష్టం కలిగించినందుకుగాను జీ నెట్‌వర్క్‌, ఐపీఎన్‌ సంపత్‌కుమార్‌, న్యూన్‌ నేషన్‌లు తనకు రూ.100 కోట్లు పరిహారం చెల్లించాలని ధోని మద్రాస్‌ హైకోర్టులో పరువు నష్ట దావా వేశారు.