విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైన ఈ రోజు సుప్రీంలో వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం విభజనపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఆరువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.