ఖమ్మం

నష్టపరిహారం పెంచాలని సబ్‌కలెక్టర్‌కు వినతి

ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్‌కలెక్టర్‌ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.

వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నం

ఖమ్మం(దమ్మపేట): తన ఆటోకు అన్ని పత్రాలున్న సత్తుపల్లి మోటరు వెహికికిల్‌ అధికారులు ఆటోను సీజ్‌ చేశారంటూ వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నానికి పాల్పడినాడు. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన …

ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ

ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్‌ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బ్యాంక్‌ఖాతా నుంచి తెలియకుండానే 65వేలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మం: ఏన్కూరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రాధారాణి అనే ఉపాధ్యాయురాలి బ్యాంక్‌ ఖాతా నుఉంచి గుర్తు తెఇయని వ్యక్తులు పాట్నాలో రూ.65వేలు డ్రా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకచ్చింది. …

దమ్మపేట మండలంలో ట్రాక్టర్‌ కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం …

మొద్దులగూడెంలో కాపుసారాకు బానిసై మహిళ మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో  తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం …

దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు

ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.

తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు-15గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు

కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతున్న పాలవాగు

ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు

ఖమ్మం: కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ డిమాండ్‌ తో ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన వార్షిక మరమ్మతుపనులు వాయిదా వేయడమే దీనికి …