నల్లగొండ

సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్గొండ: భూవనగిరి సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవోగా పనిచేస్తున్న ముత్యంరెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొంది. …

ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా

నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు విద్యుత్‌ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్‌ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.

డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి

నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.

విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం

నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు …

ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

నల్గొండ: పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. నాగార్జున అనే యువకుడు …

తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది

నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.

పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నల్గొండ: హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే అధికారులు ఆలేరు వద్ద రైలును నిలిపివేసి మంటలను …

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

నల్గొండ: అప్రకటిత విద్యుత్‌ కోతలకు  నిరసనగా జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలంలో రైతులు రోడ్డెక్కారు. గట్టికల్‌, పాతర్లపాడులో సబ్‌స్టేషన్లను ముట్టడించి విద్యుత్‌ అధికారులను నిర్భంధించారు. కోతల ఎత్తివేతపై …

ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లిలో ఇసుక ఆక్రమ  రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలలగూడ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనికీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న …