జాతీయం
సోనియాతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం.
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి,(జనంసాక్షి): స్టాక్మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 18,519 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 5471 వద్ద ముగిసింది.
రాజ్యసభ అరగంట వాయిదా
ఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.
ఢిల్లీ కోర్టుకు టీనా అంబానీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ఇవాళ ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 2జీ కేసులో సాక్షిగా టీనా అంబానీ హాజరయ్యారు.
లోక్సభ మరోసారి వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనలు లోక్సభలో కొనసాగుతున్నాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
ప్రధానితో కమల్నాథ్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్నాథ్ భేటీ అయ్యారు.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు