జాతీయం
దిగ్విజయ్తో భేటీ అయిన కేవీపీ
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్తో కేవీపీ చర్చించినట్లు సమాచారం.
సోనియాతో సీఎం కిరణ్కుమార్ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఆరుగురు మావోయిస్టులకు అరెస్టు చేసిన పోలీసులు
చత్తీస్గడ్,(జనంసాక్షి): రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా చౌడి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.
ఢిల్లీలో ఆహారభద్రత కార్యక్రమం ప్రారంభం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలో ఆహార భద్రత కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించారు. దీంతో దేశంలో ఆహారభద్రత అమలు జరిపిన తొలిరాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.
లోక్సభ ఎల్లుండికి వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు రక్షాబంధన్ సెలవు కావడంతో సభ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు