కర్నాటకలో ప్రేమజంట హత్య!
బెంగళూరు,నవంబర్ 8 (జనం సాక్షి) : కర్నాటకలోని గడగ్ జిల్లాలో ప్రేమజంట హత్య కలకలం సృష్టించాయి. పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు తరువాత ప్రేమజంట గ్రామానికి వస్తే రాళ్లతో కొట్టిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దళిత వర్గానికి చెందిన రమేష్ (29), లంబని కులానికి చెందిన రవితో స్నేహం చేసేవాడు. ఈ నేపథ్యంలో రవి చెల్లెలు గంగమ్మను రమేష్ ప్రేమించాడు. ఎవరికి చెప్పకుండా రమేష్ గంగమ్మను పెళ్లి చేసుకున్నాడు. గంగమ్మ దళిత వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు లంబని కులస్థులు కోపంలో రగిలిపోయి ఆ ప్రేమజంటపై పగపెంచుకున్నారు. గురువారం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆ జంట తన సొంతూరుకు చేరుకోగానే ఆ జంటపై లంబని కులస్థులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం నిందితులు ఊరి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గజేంద్రగడ్ పోలీసులు అధికారులు తెలిపారు.