*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర గౌరవ పాదయాత్ర ప్రారంభం

*అలంపూర్ ఆగస్టు 8 జనం సాక్షి* స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తాలూక కాంగ్రెస్ పార్టీ సమన్వకర్త  లక్ష్మీ నారాయణ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ పాదయాత్రలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు  తెలిపాడు. ఈ పాదయాత్ర 7 రోజుల పాటు 42 గ్రామపంచాయతీలో సమస్యలను తెలుసుకుంటూ 151 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగుతుందని, ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.