నల్ల జెండాలు ఎగురవేయాలని కేసీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌: నవంబర్‌ 1 వ తేదీని తెలంగాణ విద్రోహం దినంగా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలియజేశారు. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పట్టణ. జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.