స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. 37 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 79 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార భాజపా 7 స్థానాల్లో గెలుపొంది… 31 చోట్ల అధిక్యంలో ఉంది. జేడీ (ఎస్‌) పది చోట్ల విజయం సాధించింది. 32 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. కేజేపీ ఒక చోట విజయం సాధించగా… 10 స్తానాల్లో ముందంజలో ఉంది.