తిరుపతి లడ్డూలో ఇనుపముక్క

హైదరాబాద్ : భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్కు చెందని ఓ భుక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని దర్శనం అనంతరం లడ్డు కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు.అనంతరం దేవుని ప్రసాదాన్ని బంధువులకు పంచే క్రమంలో లడ్డులో ఇనుప ముక్క గుర్తించాడు. దాంతో శ్రీవారి ప్రసాదం తయారీలో టీటీడీ నిర్లక్ష్యం పట్ల భక్తుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. లడ్డూలోని ఇనుపముక్క ఉన్న విషమాన్ని మీడియాకి తెలియజేశాడు.



