పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్ : వరంగల్, మెదక్ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్ రూరల్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్దనుంచి 580 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, రెండు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



