రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.