ఆంధ్రబ్యాంక్‌లో చోరికి విఫలయత్నం

రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆంధ్రబ్యాక్‌లో గత రాత్రి చోరికి దోపిడి దోంగలు విఫలయత్నం చేశారు. అయితే లాకర్‌ రూమ్‌ ఎంతకీ తెరుచుకోకపోవడంతో వారు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులకు బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. మెయిన్‌ రోడ్డుపై రద్దీగా ఉండే ప్రాంతంలో బ్యాంక్‌ లో దుండగులు చోరీకి యత్నించటం చర్చ నీయాంశంగా మారింది. దీంతో క్రైం పోలీసులు, క్లూస్‌ టీమ్‌ సంఘటన స్థలం నుంచి వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే బ్యాంక్‌లో దోపిడి దోంగలు చోరి చేసేందుకు విఫలయత్నం చేశారు.