ముగిసిన టీ.ఎంపీల 48 గంటలు దీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల రెండు రోజుల దీక్ష ముగిసింది. పార్లమెంట్‌ ప్రాంగణంలో బుధవారం వారు దీక్షను విరమించారు. డిసెంబర్‌ 9 ప్రకటన అమలు చేయాలని ఏప్రిల్‌ 29  నుంచి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు దీక్షను దిగిన విషయం తెలిసిందే. అయితే 48 గంటలు దీక్ష చేసినా కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం తెలంగాణ ఎంపీలను పట్టించుకోలేదు.