ఈ సారి కాంగ్రెస్‌దే విజయం

-కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ

బెంగళూరు : ఐదేళ్లుగా భాజపా అవినీతితో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. బెంగళూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఈ ఉదయం ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు పట్టం కడతారని అశాభావం వ్యక్తం చేశారు.