ఏక్తాకపూర్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి

ముంబయి : బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తాకపూర్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. దాదాపు వందమంది అధికారులు ఆమె ఇంటిని, బాలాజీ టెలిఫిల్మ్స్‌ కార్యాలయాలను సోదా చేశారు. బాలాజీ టెలిఫిల్మ్స్‌ కి జేఎండీగా ఉన్న ఏక్తాకపూర్‌ను కంపెనీ ఆదాయ లావాదేవీల గురించి అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. సంస్థ చైర్మన్‌గా ఏక్తా తండ్రి జితేంద్ర వ్యవహరిస్తున్నారు.