ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16  జ‌నంసాక్షి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ప్రభుత్వ శాఖలకు భూమల కేటాయింపు, మున్సిపల్‌ కమిషనర్లకు అధికారాల పెంపు, ఆలయ కమిటీల పదవీకాలం రెండేళ్ల నుంచి ఏడాదికి పెంపు, డ్రైవర్లకు రూ.5లక్షల ఇన్సురెన్స్‌, సమైక్య ఉద్యమ కేసుల ఎత్తివేత, హార్టికల్చర్‌, నిత్యావసరవస్తుల ధరలు, ఎర్రచందనం అమ్మకం, ఇసుక మైనింగ్‌, అవినీతిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.