కర్ణాటక ఎన్నికలకు భారీ బందోబస్తు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా 35 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కోసం 6,200 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. మరోవైపు నిన్నటితో ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు.