కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుంది : మునియప్ప

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి మెజార్టీని సాధిస్తుందని కేంద్రమంత్రి మునియప్ప అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కేంద్రంలోని యూపీఏ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీని గెలిపించాయని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని భాజపా సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.