ఖైదీని పరామర్శించిన పాక్‌ హైకమిషన్‌ అధికారులు

చండీగఢ్‌ : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్‌ సీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లాను ఆ దేశ హైకమిషన్‌ అధికారులు పరామర్శించారు. నిన్న జమ్మూలోని కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న పాక్‌ ఖైదీపై తోటి ఖైదీలు దాడి చేసిన విషయం తెలిసిందే.