పార్లమెంట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ 9:3 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌ తేదేపా అధినేత చంద్రబాబునాయుడు, తేదేపా ఎంపీలు, కేంద్ర మంత్రి పురందేశ్వరి, హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జైరాం రమేశ్‌, గులాంనబీ ఆజాద్‌, పళ్లంరాజు, జైపాల్‌రెడ్డి, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ భాజపా నేతలు అధ్వానీ రవి శంకర్‌ ప్రసాద్‌, మురళీమనోహర్‌ జోషీ, అరుణ్‌జైట్లీ, ఎస్పీ అధినేత ములాయం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.