రాష్ట్ర సాధన కోసం మరింత ఒత్తిడి తీసుకువస్తాం

-దీక్ష విరమించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. 48 గంటలపాటు పార్లమెంట్‌ అవరణలో చేపట్టిన ఎంపీలు దీక్ష ఈ ఉదయం ముగిసింది. అనంతరం ఎంపీలు దీక్షకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఇచ్చిన మాట నిలబెట్టు కోవడంపై తమ అధిష్టానానికి పాలుపోవడం లేదని అన్నారు. రాష్ట్ర సాధన కోసం కేంద్రం, అధిష్ఠానంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.