సీఎం వ్యాఖ్యలు దురహంకారపూరితం: కేటీఆర్‌

న్యూఢిల్లీ: బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడింది. నిన్న సంగారెడ్డి సీఎం చేసిన వ్యాఖ్యలు దురహంకారపూరితమైనవని ఆపార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఢిల్లీలో తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడ ముడి సరకు దొరికితే అక్కడే పరిశ్రమ పెట్టాలన్నది తమ పార్టీ డిమాండ్‌ అని చెప్పారు. భీమదేవనపల్లి , గూడూరు, బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజంలో 10 శాతమైనా విశాఖలో ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమంపై మాట్లాడేందుకు కిరణ్‌కుమార్‌కు శక్తి చాలదని అన్నారు. రక్షణ స్టీల్స్‌కు కేటాయింపులను మొదట వ్యతిరేకించింది తెరాసయేనని తెలిపారు.