స్పీకర్‌ను కలవనున్న టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణకు తమ పార్టీ అధినేత చంద్రబాబుకు లోక్‌సభ స్పీకర్‌ నుంచి ఆహ్వానం అందకపోవడం పట్ల టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేపు ఉదయం 10:30 గంటలకు స్పీకర్‌ మీరాకుమార్‌ కలవాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.