20 కంపెనీల సీఆర్పీఎఫ& బలగాలను కోరిన రాష్ట్ర పోలీస్ శాఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో భద్రతా చర్యలకు గాను 20 కంపెనీల సీఆర్పీఎప్ బలగాలను కోరింది రాష్ట్ర పోలీస్ శాఖ. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్టా సీఆర్పీఎప్ బలగాలను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలిటరీ బలగాలున్నాయని డీజీపీ కార్యాలయం పేర్కొంది. చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పరిస్ధితి ప్రశాతంగా ఉందని, అవసరాన్ని బట్టి జిల్లాల్లో బందోబస్తు ఏర్పాటుచేస్తామని డీజీపీ కార్యాలయం పేర్కొంది.



