ఇంకెంతకాలం సంప్రదింపులు కొనసాగిస్తారు: పొన్నం

న్యూఢిల్లీ : తెలంగాణపై ఇంకెంత కాలం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణంలో చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్వహించిన అఖిలపక్ష భేటీ తర్వాత కూడా తెలంగాణపై నిర్ణయంలో జాప్యానికి కారణం చెప్పాలని ప్రభుత్వాన్ని పొన్నం కోరారు. తెలంగాణ వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.