ఉదయం 10.30 గంటల వరకు 15 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చేపట్టినట్లు చెప్పారు.