ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర : బాలకృష్ణ

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పార్లమెంట్‌ ఆవిష్కరించిన నేడు భారత దేశం గర్వించదగ్గ రోజు అని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహౄవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అని కొనియాడారు. ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పారు.