కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్‌ చేసిన  విషయం తెలిసిందే. జిల్లాలో  వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్‌ చేశారు