కారులో యువతిపై అత్యాచారం

గుర్గావ్‌ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో నడుస్తున్న కారులో 23 ఏళ్ల యువతి పై ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్‌లోని ఓ మాల్‌ వద్ద పని ముగించుకుని బయటకు వచ్చిన యువతి కారు ఎక్కగా మహిపాల్‌ పూర్‌, పాల్వాల్‌ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తేసుకెల్లి వారీ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. కారులోని ఇద్దరు నిందితులు ఆమెకు పరిచయస్తులేనని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సంఘటన జరగగా మంగళవారం ఆమె ఫిర్యాదు చేసిందని కేసు పమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.