కాల్‌ రేట్లు పెంచిన రిలయన్స్‌

ముంబయి, జనంసాక్షి: ముబైల్‌ కాల్‌ రేట్లను పెంచినట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ప్రకటించింది. జీఎన్‌ఎం, సీడీఎంఏ రెండిటిలోనూ రిలయన్స్‌ ప్రి పెయిడ్‌ వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా కమిట్‌మెంట్‌ ప్లాన్స్‌ని సవరించామని, 20 నుంచి 30 శాతం వరకూ కాల్‌రేట్లు పెంచామని ఆర్‌కామ్‌ వైర్‌లెన్‌ బిజినెస్‌ విభాగపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గుర్ధీవ్‌ సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.