కూడంకుళం అణుకేంద్రంపై సుప్రీం తీర్పు రేపు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు సోమవారం వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎస్‌ రాధాకృష్ణన్‌ , దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. అణువిద్యుత్కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పలువురు కార్యకర్తలు కేంద్రం భద్రత విషయంలో సందేహాలు లేవనెత్తుతూ న్యాయస్థానంలో కేసులు పెట్టారు.