కోటిరూపాయల రియాల్టీ షో విజేత.. పోర్టర్‌ భార్య

తిరుపవనంతరం, జనంసాక్షి: 38 ఏళ్ల సమాజా రాజన్‌ కష్టాలన్నీ ఒక్కరాత్రితో తీరిపోయాయి. ఊహించని రీతిలో 15 ప్రశ్నలు ఏకబిగిన సరైన సమాధానాలు చెప్పేసిన ఈ గ్రాడ్యుయేట్‌ కోటిరూపాయల బహుమతి మొత్తాన్ని గెలుచుకుంది. ఆసియానెట్‌ టీవీ నిర్వహించిన కౌన్‌ బనేగగా కరోడ్‌పతి తరహా రియాలిటీ షో బుధవారంనాటి ఎపిసోడ్‌లో సనూజ విజేతగా నిలిచింది. ఈ షోలో రోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేత ఆమె. డిగ్రీ చదివిన సనూజది కులాంతర ప్రేమ వివాహం. దాంతో ఇరువైపుల పెద్దలు సహకారం లభించలేదు. భర్త పోర్టరుగా పనిచేస్తున్నాడు. భార్యను ప్రోత్సహించి చదువు పూర్తిచేయించడమే కాక ప్రభుత్వోద్యోగి కోసం పరీక్షలన్నీ రాయించేవాడు. ఏడాదిన్నర క్రితమే కలెక్టరాఫీసులో ఆమెకు ఉద్యోగం లభించింది. అయినా ఇద్దరు పిల్లలతో సంసారం ఈదడం కష్టంగానే ఉంది. అనారోగ్యం, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వారిని అప్పుల్లో ముంచాయి. దాంతో సనూజ పట్టుదలగా పోరాడారు. ఫలితం సాధించారు. ఇప్పుడిక అప్పులు తీర్చేసి,తన భర్తకు కొత్త కారు కొనిచ్చి టాక్సీడ్రైవర్‌గా పనిచేసుకోమంటానని ఆమె ఆనందంగా తెలిపారు.