జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతున్న సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఐకాస చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండో రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతోంది. పలువురు నేతలు దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. భాజపా నేత విద్యాసాగర్‌రావు, స్మృతిఇరాని తదితరులు దీక్షాస్థలికి వచ్చి తమ మద్దతు తెలిపారు.