రాజమండ్రి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న బోగీలో మంటలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్లో నిలిచి ఉన్న ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం అందించే మెడికల్ రిలీఫ్ వ్యాన్ (అరోగ్య సహాయక వ్యాన్) మంటల్లో ఆహుతైంది. మంటలధాటికి గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సంఘట స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.