జిల్లాలో అన్నిసీట్లు గెలుస్తాం
ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం,నవంబర్14(జనంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జి/-లలాలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంటామని
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టిఆర్ఎస్కు తిరుగు లేదని, మరోమారు కెసిఆర్ సిఎం కాబోతున్నారని అన్నారు. మహాకూటమి ప్రభావం లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. పలు గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాలను చూసి వివిధ రాజకీయ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆకర్శితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అత్యధిక
ప్రజానికం కోరుకుంటున్నారన్నారు. అలాగే జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేవిూ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. మరో ఐదేళ్లు అధికారం ఇస్తే ప్రతీ గ్రామం నందనవనంగా తయారు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీతో కాంగ్రెస్ జత కట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అటు ఢిల్లీకి ఇటు ఆంధ్రాకు తాకట్టు పెట్టొద్దని కోరారు.