తల్లికి నిప్పంటించిన కొడుకు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో దారుణం చోటుచేసుకుంది. తాగుడుకి బానిసైన ఓ కొడుకు పది రూపాయాలు ఇవ్వలేదని తల్లికి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అదుపులోకి తీసుకున్నారు.