తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం అన్న ఈటెల

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల ఆక్షాంక్షతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.