దర్యాప్తునకు విజయసాయి అవరోధం కలిగిస్తున్నారు
-సుప్రీంకోర్టులో సీబీఐ న్యాయవాది
న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ దర్యాప్తునకు విజయసాయిరెడ్డి అవరోధం కలిగిస్తున్నారని కోర్టులో సీబీఐ న్యాయవాది వాదించారు. వాంగ్మూలం ఇచ్చే సంస్థలను విజయసాయి బెదిరించినట్లు తమ వద్ద అధారాలున్నాయని కోర్టుకు తెలిపారు. సాక్షులను ప్రభావితం చేయడం వల్ల దర్యాప్తు అలస్యమవుతోందని చెప్పారు.