నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, సెప్టెంబర్ 10 : భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం భారీ  నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొలుత 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత 400  పాయింట్లు నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో నడుస్తోంది.  నిఫ్టీ 100 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో మన మార్కెట్లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 3 శాతం నష్టాల్లో ఉన్నాయి.