నేడు సరబ్జిత్సింగ్ అంత్యక్రియలు
అమృత్సర్ : పాకిస్థాన్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత చెందిన సరబ్జిత్ అంత్యక్రియలు నేడు పంజాబ్లోని స్వగ్రామం బిఖివింద్లో అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరుకానున్నారు. సరబ్జిత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పంజాబ్ ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాల్ని ప్రకటించింది.