పార్లమెంట్‌ ఉభయసభలు 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష సభ్యలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే సభ్యులు బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2గంటలకు వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ కూడా విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది.